ఇదీ ఆసుపత్రే.. నమ్మాలి అంతే.






ఇది నల్లగొండ జిల్లా కేంద్రంలోని  కేంద్ర ప్రభుత్వ  ఆసుపత్రి   జిల్లా నలుముల ఉన్న పేద ప్రజలకు   కొంతలో కొంత మెరుగైన వైద్యం  అందించే ఏకైక ఆసుపత్రి..   పోయిన  సంవత్సరంలో మే నెలలో ఈ  ఆసుపత్రి స్దాయిని  250 పడకలనుంచి  400  పడకలకు పెంచుతున్నట్లు  స్వయాన ప్రభుత్వమే  నిర్ణయం తీసుకుంటూ  జీఓ లను   విడుదల చేసింది..  ప్రభుత్వం  జీఓ విడుదల చేసి  ఎనిమిది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ ఒక్క పైసా  నిధులు విడుదల కాలేదు.. ఒక్క  అదనపు సిబ్బందిని గానీ , డాక్టర్లను , వసతులను కానీ ఏర్పాటు చేయలేదు. దీంతో   ఆసుపత్రికి  వచ్చే రోగులకు సరైన వైద్యం అందక  సౌకర్యాలు నేలపైనే పడుకుంటున్నరు. మాములు వాళ్ల సంగతి అలా ఉంచితే  ప్రసవం కోసం వచ్చే మహిళలు పడకలు లేక నేలపైనే పడుకుంటూ పడరాని పాట్లు పడుతున్నరు. పేరు గోప్ప ఊరు దిబ్బ అన్న చందంగా పేరుకేమో  పెద్దఆసుపత్రి వసతులేమో చిన్నసుపత్రి అన్నట్లు తయారైందని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు నిర్లక్ష్యంతో ఆసుపత్రికివచ్చిన  వైద్య సదుపాయాలు సౌకర్యాలు లేక   విలవిల లాడుతున్నమని ఆవేదన చెందుతున్నరు.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రిటైర్ ఉద్యోగుల్లో కొత్త ఆశలు నింపుతున్న టీ-సర్కారు

17 సెప్టెంబర్ - తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగ అంశాలు...

సర్వరోగాలను నయం చేసే బ్రహ్మస్త్రం ఈ దివ్యఔషదం