ఆదిలాబాద్ అడవుల్లో మరో శబరి
ఆదిలాబాద్ అడవుల్లో మరో శబరి . అదిలాబాద్ అడవుల్లో నాగోబా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. డప్పు చప్పుల్లు.. సాంప్రదాయ నృత్యాలతో ఆదివాసీలు నాగోబా జాతరకు తరలివస్తున్నరు. జాతర మొదలైన కొద్ది గంటల్లోనే వేలాది మంది భక్తులు పోటెత్తారు. గంగా జలాలతో మెస్రం వంశీయులు నాగోబాను అభిషేకించి జాతరను షురూ చేసిన్రు. చిమ్మచీకట్లో నాగోబా ఆలయ ప్రవేశం చేశాడు. వేలాది మంది ఆదివాసీల కొలుపులతో నాగోబా జాతర జోరుగా మొదలైంది. పుష్యమాస అమావాస్య ప్రారంభమైన తొలిగడియల్లోనే మెస్రం వంశీయులు జాతరను ప్రారంభించిన్రు. కాలినడకన పవిత్ర గంగా జలాలతో ఇంద్రవెల్లిలోని ఇంద్రాయిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన్రు. ఈ పూజతో నాగోబా జాతర మొదలైంది. నాగోబా .. గోండుల అతిపెద్ద జాతర కావడంతో మన రాష్ట్రం నుంచే కాక , మధ్యప్రదేశ్ , మహారాష్ట్రల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు . తమ ఇలవేల్పు నాగోబాను దర్శించుకొని భక్తులు పులకించిపోతున్నరు. ఎడ్లబండ్లు.. కాలినడకన భక్తులు ఆలయానికి వస్తున్నారు. నాగోబా దైవనామస్మరణతో ఆలయపరిసరాలను హోరెత్తిస్తున్నరు. జాతరను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ వెలుగులతో అలంకరించిన్రు. కొత్త కుండల్లో తీ...