పోస్ట్‌లు

జూన్ 16, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

మా భూమి

చిత్రం
"మాభూమి" ఒక అద్భుతం .. మా భూమి సినిమాకు ముప్పయ్యేళ్లు నిండాయి. అన్ని సినిమాల్లాగే మా భూమినీ చూస్తే.. చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. తెలుగు సినిమాల్లో దేనికీ లేని ప్రత్యేకత ఈ సినిమాకు ఉంది. అందుకే.. మూడు దశాబ్దాలు గడిచినా.. ఇప్పటికీ అందరికీ గుర్తుకు వస్తుంది. ఇంతకీ.. మాభూమి గొప్పదనం ఏమిటి? ఇప్పుడు కూడా చర్చించుకోవడానికి కారణం ఏమిటి? సినిమా అంటే.. ఇమేజ్ ఉన్న హీరో ఉండాలి. ఒంపుసొంపులు చూపించే హీరోయిన్ ఉండాలి. హీరో ఇమేజ్‌ను చాటిచెప్పడానికి నాలుగు ఫైట్లు.. ఆరు పాటలు.. ఓ వంద డైలాగ్‌లు ఉండాలి. ఇదీ 1980 నాటికి తెలుగు సినిమా పరిస్థితి. కానీ.. ఈ సమయంలో విడుదలైన మాభూమి సినిమాలో మాత్రం.. మనకు ఇవేవీ కనిపించవు. పేరున్న హీరోహీరోయిన్లు లేరు... హీరోయిన్ల అంగాంగ ప్రదర్శన లేదు. జ్యోతిలక్ష్మి ఐటెం సాంగులూ లేవు.. కానీ.. అంతకుమించి.. హృదయాలను కదలించే కథ ఉంది. అదే ఈ సినిమా విజయానికి తొలిమెట్టయ్యింది. మాభూమి సినిమాలో గుండెల్ని పిండే సామాజిక అంశం ఉంది. నిజాంనవాబు దురాగతాలకు బలైన సామాన్యుడి ఇతివృత్తముంది. కడుపు మండి భూస్వాములపై తిరగబడ్డ సా...

పోచమోని జంగయ్య 13వ వర్థంతి ఆగష్టు 23

తెలంగాణ సాయుధ పోరాట యోధులు పోచమోని జంగయ్య 13వ వర్థంతి ప్రజాశక్తి-మంచాల Mon, 23 Aug 2010, IST తెలంగాణ సాయుధ పోరాట యోధులు పోచమోని జంగయ్య పరమపధించి నేటికి 13 వసంతాలైంది. ఆయన వర్థంతి సభను వ్యకాస ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి కె.జగన్‌, మండల కార్యదర్శి కంబాలపల్లి భాస్కర్‌ తెలిపారు. ఈ ప్రాంతంలో దున్నెవానికే భూమి దక్కాలని, వెట్టి చాకిరి విముక్తి పొందాలని, జజాకార్ల రాచరిక పాలనకు చరమగీతం పాడాలని నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జంగయ్యది కీలకపాత్ర. దళపతిగా కామ్రేడ్‌ కృష్ణమూర్తి(రాగన్న)కు సహచరుడుగా పని చేశారు. నల్గొండ జిల్లాలో కలిసి ఉన్న ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఎర్రజెండాను పల్లెపల్లెకు తీసుకుపోయిన ధీరుడు జంగయ్య. సాయుధ పంథాను వదిలిన తరువాత భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఇబ్రహీంపట్నం డివిజన్‌ కమిటీ కార్యదర్శిగా పని చేశారు. 19...

కోటి లింగాల

చిత్రం
కోటి నాణేల చరిత్ర’ - సదానంద్ October 10th, 2010 కోటి నాణేల చరిత్ర’ - సదానంద్ October 10th, 2010 దక్షిణ భారతదేశాన్ని (ఆంధ్రాతో సహా) నాలుగు వందల యాబై ఏళ్లపాటు నిరాటంకంగా పాలించిన శాతవాహనుల తొలి రాజధాని నగరమే ‘కోటిలింగాల’ ఆంధ్రుల మహోజ్వల చరిత్రకు బీజం పడింది ఇక్కడే. కరీంనగర్ జిల్లాలోని వెల్గటూరు మండలంలో మారుమూలన విసిరేసినట్లుగా ఉండే గోదావరి తీర ప్రాంత గ్రామం కోటిలింగాల కరీంనగర్-రాయపట్నం రహదారిపై వెల్గటూరు నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. 1979-80 నుండి 1983-84 మధ్య నాలుగు సంవత్సరాల పాటు పురావస్తు శాఖ జరిపి...