ప్రభుత్వాలు ఉన్నాయా ఈ దేశంలో..
ప్రభుత్వాలు ఉన్నాయా ఈ దేశంలో.. (ఉంటే వీళ్లకు వైద్యం అందాలి కదా) అంతరిక్షానికి అప్ అండ్ డౌన్ చేస్తున్న ఈ రోజుల్లోనూ మూడనమ్మకాలు రాజ్యమేలుతున్నయి. కడుపు నొప్పి వస్తే.. చెంబు వైద్యంపై ఆధారపడి జీవితాలను ఆగం చేసుకుంటున్నరు ఏజెన్సీ ఆదివాసులు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి మూడనమ్మకాలను నిర్ములిస్తున్నమంటున్న ఐటీడీఏ అధికారుల మాటలు.. పచ్చి అబద్దాలని నిరూపిస్తున్నది ఖమ్మం జిల్లా ఏజెన్సీ. ఇంజక్షన్లు.. గ్లూకోజులు.. ఆపరేషన్లు.. ఎక్సరేలు.. స్కానింగ్ లు.. ఎంజీయోగ్రామ్ లు ఒక్కటేమిటి ఎన్నో అధునిక పరికరాలు.. అయినా రోగం తగ్గుతుందన్న గ్యారంటీ లేని రోజులివి. అట్లాంటిది ఓ చెంబు వైద్యంతో కడుపు నొప్పి తగ్గుతుందని నమ్ముతున్నరు అమాయక ఆదివాసులు. అలా నమ్మే ఒక్కొసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నరు. ఖమ్మం జిల్లాలోని భద్రచలం ఏజెన్సీలోని చింతూరు మండలం సరివెల గ్రామంలో కడుపు నొప్పికి ఈ చెంబు వైద్యం ఫేమస్. గూడెంలో ఎవరికైనా కడుపు నొప్పి వచ్చిందంటే చాలు వెంటనే గ్రామంలో ఉన్న చెంబు డాక్టర్ దగ్గరికి పరుగులు పెడతరు. ఇక చెంబు వైద్యునితో చికిత్స తీసుకుంటరు. కడుపునొప్పి వచ్చిన రొగి...