పోస్ట్‌లు

నిజమైన మనిషి ప్రతినిధి బికారీ బాబా..!

చిత్రం
       కళ్ళ ముందు మనిషి ప్రాణాలు పోతున్నా బిస్లరి బాటిల్ నుంచి ఒక్క చుక్క నీళ్ళు దానం చేయని మనుషులున్న ఈ కాలం లో బికారీ బాబా లాంటి ఒక మహానుభావుడు ఉన్నాడంటే నిజంగా అద్భుతమే. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఫ్యాక్షనిజం..హీరోయిజం చూపించుకుంటున్న నాయకులున్న ఈ రోజుల్లో బిక్షమేత్తుకుని దీనులకు సేవ చేసే ఒక లీడర్ ఉన్నాడంటే మిరాకిలే మరి. అందుకే బికారీ బాబా సంతింగ్ స్పెషల్ గెస్ట్ గా ఈ వ్యాసం చదవండి.

ఈ కల్తీ దేశంలో...

చిత్రం
       గోదారి నీళ్ళు, స్వచ్చమైన గాలి, మండే నిప్పు, జీవరాశిని కాపాడే ఓజోన్ పొర, తినే తిండి, కట్టుక్జునే బట్ట ఇలా చెప్పుకుంటూపోతే ఈ దేశంలో అన్ని కల్తీనే.. ఒక్క  అమ్మ పాలు  తప్ప.                 ప్రశాంతంగా ఉండాల్సిన నేల తల్లి, మూగ జీవాలు మనిషి స్వార్ధంతో మనుగడను కోల్పోతున్నాయి. అవసరం ఉన్న లేకున్నా ప్రతిదాన్ని విచ్చలవిడిగా వాడే మానవుని వైకరి మూగ జీవాల ఉసురు పోసుకుంటున్నది.అందుకు మంచి ఉదాహరణే ఈ వార్త కథనం.            అంతే కాదు మోతాదుకు మించి వాడుతున్న రసాయనాలు సహజ ఎరువులుగా పనిచేసే రైజోబియం లాంటి బాక్టీరియాలను చంపేస్తున్నాయి. ఇవే కాదు ఇంకా అనేక రకాల మనవ ఉపకారులు మనిషి స్వార్ధానికి బలైపోతున్నాయి. ఈ విధానం ఇలానే కొనసాగితే మనవ జాతి అంతం కావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.  

వివాదంలో దేనికైనా రెడీ..!

చిత్రం
వివాదంలో తెలుగు సినిమా రంగం..  దేనికైనా రెడీ అంటున్న బ్రాహ్మణులు. హీరోల వెకిలి ఆలోచనలతో.. డైరెక్టర్ల సృజనాత్మక లోపాలతో తెలుగు సినిమా రంగం వివాదాలకు..వెకిలి వేషాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది.. మొన్నటికి మొన్న తెలంగాణా ప్రజల మనసులకు గాయం చేసిందని ఓ సినిమాపై పెద్ద దుమారం రేగి సర్కారు జోక్యం తో 16 కట్లతో బయటపడ్డ ఆ సినిమా ఇప్పటికి కోలుకోలేక పోతుంది.    ఆ వివాదం మరువక ముందే మంచి విష్ణు నటించిన దేనికైనా రెడీ బ్రాహ్మణుల ఆగ్రహావేశాలతో విలవిల్లాడిపోతుంది. బ్రహ్మనులపై విష్ణు అనుచరులు కర్రలతో దాడి చేసి గాయపరచడంతో.. బ్రాహ్మణ ప్రతినిధులు విష్ణు పై చెప్పులు విసిరి నిరసన వ్యక్తం చేసారు.         ఒకరి మనసులు గాయం అవుతాయి అనుకున్నప్పుడు..ఒకరి మనోభావాలు దెబ్బతింటాయి అనుకున్నప్పుడు అలంటి సినిమా ఎందుకు తీయాలి. సినిమా అనేది క్షణిక ఆవేశం కాదు.. అనుకోకుండా తీసాం అని సర్ది చెప్పుకోవడానికి.. కొన్ని నెలలపాటు షూటు, రీషూట్లు చేసే సినిమాల్లో వివాదాలు ఉండటం కచ్చితంగా కావాలనే తీసారని భావించవలసి వస్తుంది. ఇంకా కొందరు జ్ఞాన శూన్య దర్శకులు కావాలనే...

నువ్వొక ఒంటరివి..!

చిత్రం
దేశం లో  జనం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న  మనుషులు మాత్రం ఒంటరవుతున్నారు .. ఏది తేకున్న అన్నీ కోల్పోయినట్టు.. అంతా నాశనం అయినట్టు.. వెలుగులు విరజిమ్ముతున్న కాలం  కారు చికట్లలో మగ్గినట్టు.. బంధాల దొంతర ఎడబారినట్టు.. మనిషనే మమతను  కిలోమీటర్ల కింద పతిపెట్టినట్టు.. ఎక్కడికో పయనం.. మరెక్కడో గమ్యం..!! కత్తుల సావాసం కటకటలా నెడితే.. అమ్మ కాదుకదా దాని జేజమ్మ వచ్చినా కాపాడలేదు.. న్యాయం నీన్ను విడిస్తే. గుర్తుంచుకో బ్రదర్  మంచి ముందు కస్టపెడుతుంది.. చెడు తర్వాత చుక్కలు చూపిస్తుంది.. దాని బారిన పడితే ఎండ్ లేదు. క్యాష్ కోసం క్యారెక్టర్ చంపుకుంటే.. దానమ్మ అది ... నువ్వు చెంచల్ గూడ జైల్లో ఉన్న వదిలిపెట్టాదు.. నిన్ను అధపాథలం తోక్కేదాకా. కాసులకున్న కమిట్మెంటే అది మరి. మనం సృష్టించిన మనీనే కదా అని  ఆటలడేవు సెహ్వాగ్ సిక్స్ లాగ నిన్ను  లైఫ్ బౌండరి బయటికి విసిరికోడతది. అయినా నా ఇష్టం అంటే    అది నీ ఇష్టం సోదరా.. తినే పిడికెడు తిండి కోసం.. విలువల వలువలుడదీసి.. చెర్నాకోల చేతబట్టి మానవత్వం వీపుపై విమానం మోగించి.. ఏం సా...

ఎక్కడికి వెళ్ళావు బంగారం..?

చిత్రం
                              అమ్మ గోరుముద్దలు కలిపి                      నీ కోసం ఇల్లంతా గాలిస్తుంది..                     వా..న్                      టూ..                     త్రీ..                      ఎక్కడ ఉన్నా మా సాన్వి తల్లి రావళి..                     అంటూ నీతో ఆటలాడిన నీ జ్ఞాపకాలతో                      వల వల ఏడుస్తుంది..                     నీ చిట్టి పొట్టి మాటల కోసం...                     కన్నీరు మున్నిరుగా విలపిస్తుంది. ...

ఈ విజయం భావితరాల కోసం ..!

చిత్రం
            బడి పిల్లలపై పరీక్షలు పెను భారాన్ని మోపుతున్నాయి. తల్లితండ్రుల ఆలోచనలను క్యాష్ చేసుకునేందుకు విద్య సంస్థలు టాలెంట్ టెస్ట్ ల పేరుతో విద్యార్దులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఒకవైపు రోజు వారి విద్య విధానమే యాంత్రికమై ఆట పాటలు లేకే పసిమొగ్గలు తల్లడిల్లి పోతుంటే..ఈ టాలెంట్ టెస్ట్ లు చిన్నారుల పాలిట గుదిబండలుగా తయారయ్యాయి. అమ్మల ఆత్మీయ ఆలింగనం..నాన్నల అపురూపమైన స్పర్శలు కరువయ్యి చిన్నారులు హింసాత్మక ఆలోచనల వైపు మగ్గుతున్న విషయాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా ఆ వైపుగా ఆలోచించే తీరిక ఎవరికీ కలగక పోవడం భాదకరమే.              చిన్నారుల పై విద్యా సంస్థలు మోపుతున్న టాలెంట్ టెస్ట్ ల ఒత్తిడిని నిలిపి వేయాలంటూ బాలల హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసింది. రియాలిటి షో లలో చిన్నారులను వేధించడం నేరమని తీర్పు ఇచ్చినట్టుగానే.. టాలెంట్ టెస్టులను నిషేదించాలని తీర్పునివ్వాలని మనస్పూర్తిగా కోరుకుందాం. 

ఈ దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం లో..!

చిత్రం
              దోచుకున్నవాడికి దోచుకున్నంత..ఈ పదం నేటి రాజకీయాలకు అతికినట్టు సరిపోతుంది. ఎలక్షన్ల ముందు నామినేషన్ పత్రంలో అప్పులు, ఆవకాయ ముక్కలు తప్ప తమ దగ్గర ఏమి లేవని చిలుక పలుకులు పలికే నాయకులు.. ఒక్కసారి గెలవగానే రాత్రికి రాత్రి వేలకోట్లకు అధిపతులు అవుతున్నారు. మంత్రాలు లేవు.. మాయలు లేవు.. అంత మా చెమట చుక్కల ప్రతిఫలమని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. అసలు ఎం పని చేస్తే ఒకటి , రెండు ఏళ్లలో వేల కోట్లు సంపాదించాచ్చో చెబితే అందరు అదే పాటిస్తారు కదా ..? 

అక్షరం కోసం కర్కశత్వాన్ని ఎదురించిన వీర నారి మలాల..!

చిత్రం
              పుస్తకమంటే ఎందుకు తల్లి నీకు అంత ప్రేమ ??              బుల్లెట్లు ఎదురోస్తున్నా అక్షరాలను ముద్దాడలనుకున్న..              నీ గుండె దిటవు ముందు..              బోసి నవ్వుల నీ అమాయకత్వం ముందు               కర్కశత్వం ఓడిపోయింది..              రాక్షసత్వం తోకముడిచింది తల్లీ .                                                నీకు దిగిన ఒక్కొక్క బుల్లెట్టు.. సూర్యుడి  వలే...                  తాలిబాన్ల చీకటి రాజ్యాలను చీల్చేస్తుంది..            అరాచక వ్యవ...

దోచుకోవడం.. దాచుకోవడమే వారి పని..

చిత్రం
      రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించినంత పని చేసిన బ్రిటీష్ వాళ్ళు.. ప్రపంచం లోని దాదాపు అన్ని దేశాల సంపదతో పాటు.. విజ్ఞాన సర్వస్వాన్ని దోచుకుపోయారు. అయితే బ్రిటీష్ పాలకుల బానిసత్వం లోని అన్ని దేశాలు.. స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాక  .. తమ సాంస్కృతిక చిహ్నాలను తిరిగితెచ్చుకున్నాయి.అంతే కాదు తమ మేధో సంపత్తితో సృష్టించిన అనేక అద్భుతాల హక్కులను సాధించుకున్నాయి. కానీ విశాలమైన భారతావని మాత్రం ఆ పని చేయలేక పోతుంది. పాలకుల నిర్లక్ష్యం..పరిశోధకుల నిర్లిప్తత మన ఆవిష్కరణలకు ప్రమాడం లోకి నేట్టేస్తున్నాయి.         నిన్న మొన్నటి వరకు.. పసుపు, వేపాకు, కుంకుమ పువ్వు, కరివేపాకును తామే కనుగొన్నామని తెల్లోల్లు అంతర్జాతీయ పేటెంట్ కోసం అప్లై చేసేదాకా కూడా మనవాళ్ళు ఆ సంపద తమదని పేటెంట్ తీసుకోక పోవడం నిజంగా సైంటిస్టుల తప్పిదమే. పరిశోధనల మీద వేల కోట్లు దారపోస్తున్న ఒక్క ఆవిష్కరణ కొత్తది లేకపోవడం కలవార పరిచే నిజం.         ఎందరో భారతీయ మేధావులు తమ అద్బుత మేధోశక్తితో  రాసిన అమూల్యమైన అనేక గ్రంధాలు విదేశీ లైబ్రరీలలో...

గుర్రం గడ్డకు కష్టాలు ఎన్నాళ్ళు బిడ్డ..??

చిత్రం
               మా అభివృద్ధి స్పీడును అందుకోలేక చిరుతపులే పోటినుంచి తప్పుకున్నదంటారు.. ఏ దేశం పోయిన అభివృద్ధి అంటే మీదేనని తెగ పోగుడుతాండ్రని కోతలు కోస్తారు.. లక్షల కోట్ల బడ్జేట్ పెట్టి తెగ సంక్షేమం తేచ్చినమని ఊకదంపుడు ఉపన్యాసాలు దంచేస్తారు... ఏది మీ అభివృద్ధి ?? ఏ  గంగల కొట్టుకు పోయింది.. ఏ  గోదారిలో మునిగిపోయింది..?? రాష్ట్ర రాజధాని కి కూతవేటు దూరం కూడా లేని గుర్రం గడ్డ బిడ్డలా కష్టాలకు ఈ పాలకులు ఎం సమాధానం చెప్తారు ??                  ఇది ఒక్క గుర్రం గడ్డ సమస్య మాత్రమే కాదు యావద్ రాష్ట్ర సమస్య కూడా... గుర్రం గడ్డ .. ఆదిలాబాద్ జిల్లాలోని బాబుల్ గావ్.. తో పాటు ఇంకా అనేక గ్రామాలూ సరైన దారి లేక.. తాగేందుకు మంచి నీళ్ళు లేక విలవిల్లడుతున్నాయి.  ప్రభుత్వ సహాయం కోసం వెయ్యి కళ్ళతో ఎదిరి చూస్తున్నాయి. బిల్డింగుల బిల్డప్ తో అబివృద్ధి సాధించినమని తొడలు కొడుతున్న పాలకులు ఒక్కసారి గుర్రం గడ్డ ను చూస్తే అభివృద్దిలో మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది....

దోపిడీ రాజ్యం లో నీతి, రీతికి చోటెక్కడ ??

చిత్రం
           రాజకీయాల్లో నాయకులతో లబ్దిపొందిన వాడు చేసే చెక్క భజనే ఆ నాయకుడి ప్రతిభకు గీటు రాయిగా మారిన రాష్ట రాజకీయాల్లో  దేవుడి పాలనా ఏదో.. రాబందుల పాలన ఏదో జడ్జమెంట్ ఇవ్వలేని కన్ఫ్యుషన్ కాలం ఇది. దేవుడి పాలనా అంటూ ఉదరగోట్టిన నాయకులూ , పార్టీలు ఆ జమానాలో జరిగిన దింపుడుకళ్ళం కార్యక్రమాలకు ఏం సమాదానం చెబుతారో మరి.   నాయకుడి అండతో ఐ.ఏ.ఎస్ లను సుస్సు  పోయించిన  దోపిడీ ఏజెంట్ గురించి ఏ విదంగా అర్ధం చేసుకోవాలో మరి ??          

తుగ్లక్ రాజకీయాలు...

చిత్రం
                                                                     రాష్ట్రoలో చిత్ర విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయీ.. ఎవరు ప్రతిపక్షమో ఎవరు అధికార పక్షమో తెలియని అయోమయం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. ఒక వైపు చెంచల్ గూడ జైలును జగన్  వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేసాడని ప్రధాన ప్రతిపక్షంతో పాటు.. అధికార పక్షం లోని నేతలు ప్రభుత్వదినేతపై విమర్శలు ఎక్కుపెట్టిన స్పందించని ప్రభుత్వం.. కాంగ్రెస్ పార్టీ కోసం..అధినేత సోనియా కోసం జీవితాన్ని అంకితం చేస్తాననే పరమ  భక్తుడైన  శంకేర్ రావు ఇంటిపై పోలీసులను ఉసిగొల్పి వీరంగం సృష్టించడం సీ ఎం గారి పనేనని కాంగ్రెస్ శ్రేణులు అనుమానిస్తున్నాయీ. అంతే కాదు వేల కోట్లు మింగిన జగన్ను కంటికి రెప్పల కాపాడుతూ.. పార్టీ కోసం బతికే శంకేర్ రావు ను వేదించటం ...

హైదరాబాద్ కి కాలం మూడింది..!

చిత్రం
              వర్షం వస్తే చాలు ఫస్ట్ మునిగిపోయిందని పేపర్లో కనిపిం చే మొదటి పేరు ముంబై. దేశానికి ఆర్ధిక రాజధాని అయినా మునిగి పోతుంటే కళ్ళప్పగించి సినిమా చూడటం తప్పా.. ఏం చేయలేని నిస్సహాయస్థితిలో కొట్టుమిట్టాడుతుంది సర్కారు. స్వార్ధపరుల ఆపేక్షణ.. అధికారుల చేతివాటం... నాయకుల నిర్లక్ష్యం కలగలిసి ముంబాయి మొత్తాన్నీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.                   ఇక సాఫ్ట్ వేర్ రాజధాని హైదరాబాద్ పరిస్థితి  ముంబాయికి భిన్నమేమి కాదు.. ఇప్పటికే చిన్నపాటి వర్షానికి జలమయమౌతున్న నగర రోడ్లు.. రానున్న కొద్ది రోజుల్లో తీవ్రరూపం దాల్చక తప్పదు.. అందుకు కనుమరుగవుతున్న చెరువులే నిదర్శనం..           

ఇదెక్కడి నీతి ??????

చిత్రం
ఇదెక్కడి నీతి ?????? సినిమాల్లో ఇలా ??              చూస్తే దేవుడే దిగి వచ్చినట్టు అక్టింగులు... షూటింగ్ టైములో నోటికోచిన్నట్టు నీతులు చెప్తారు.. మన వెర్రి ఫ్యాన్స్ వాళ్ళనే ఆకాశం నుంచి ఉడిపడ్డ మహానుభావులని లేని లేని పోజులు కొడతరు... ఇక్కడి వరకు బానే ఉంది.. వీళ్ళు కేవలం రీలు మీద మాత్రమే హీరోలు.. బయట వీళ్ళ విశ్వరూపం దొంగల ముటలలో మేమ్బెర్లల ఉంటుంది.. నమ్మడం లేదా అయితే క్రింద వాళ్ళ సపోర్ట్ ఎవరికీ ఉందొ చుడండి... నిజ జీవితంలో ఇలా??????                                                       స్క్రీన్ పై ఎన్ని నీతులో బాబు...                               స్క్రీన్ పై దేవుడి  ...                                   ...
చిత్రం
బడి పిల్లలా  బలి పశువులా ..?                                                                                                                                                                 ...

మారని కథ..అభిమానుల వ్యథ..!

చిత్రం
మారని కథ..అభిమానుల వ్యథ.. !        ఆడిగెలవరా బాబు అంటే.. పక్కోడు ఓడితే ఆడతాం అంటూ కూర్చునే స్థితికి దిగజారింది టీంఇండియా. అజారుద్దీన్ వేసినా దారిపై గంగూలీ మాంచి రోడ్డెసిస్తే.. తేరగా వరల్డ్ కప్ తీసుకున్న ధోని..ఇప్పుడు గెలిపియ్యవయ్యా అంటే మాత్రం పక్క టీం ఢమాల్ కావాలని పూజలు చేస్తున్నాడు. ఏం లాభం మంత్రాలకు చింతకాయలు రాలుతాయా.. ఇదీ అంతే. జీవితం అన్నాక కాస్తా మంచి ఆలోచనలు పెద్ద,చిన్నవాళ్లను గౌరవించే సంస్కారం ఉండాలి. లేకపోతే వరల్డ్ కప్ తీసుకువచ్చిన సింగ్ నేతృత్వంలోనే టీంఇండియా అథ:పాతాలానికి చేరుకోవడం మాత్రం ఖాయం.  ఇప్పటికే చాలా మారాల్సిన ధోని మాత్రం ఇంకా తన మార్క్ పాలిటిక్స్ కొనసాగిస్తునే ఉన్నాడు. ఇంకా నీరో చక్రవర్తిలా నియంత రాజ్యంగా మార్చలనుకుంటున్నాడు. అందులో భాగంగానే తన దిక్కుమాలిన రాజకీయాలతో వీరేంద్ర సెహ్వాగ్ ను ఇంట్లో కూర్చోబెట్టాడు. అంతేనా పైనా కూల్ గా కనిపించే ధోని ఆ మధ్య యువరాజ్ గేమ్ తోను ఆడుకున్నాడు. పాపం యువీకి ఆరోగ్య సమస్యతో టీంకు దూరమయ్యాడు గానీ ఖచ్చితంగా ధోనీ.. యువీని కూడ తన పాలిట్రిక్స్ తో ఇంట్లో కూర్చోబెట్టేవాడే కావచ్చు. ధోని ఎల్లో ఆల...

సచిన్ వంద..మ్యాచ్ గోవిందా..!

చిత్రం
సచిన్ వంద..మ్యాచ్ గోవిందా.. !      ఎన్నాళ్లుగానో ఎదిరి చూసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీల సెంచరీ అయితే  అయ్యింది కానీ..పసికూన బంగ్లాదేశ్ చేతిలో  టీంఇండియా చిత్తుగా ఓడిపోయింది. సెంచరీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదిరి  చూసిన సచిన్... 147 బంతుల్లో 12 ఫోర్లు 1 సిక్స్ తో      114 పరుగులు సాధించాడు. అయితే ఏం లాభం  ఎప్పటిలాగే తన శతకం కోసం అమూల్యమైన 33 బాల్స్ ను హృదా చేసాడు.  ఈ 33 బంతుల్లో బాల్ కు ఒక పరుగు వస్తే జట్టు స్కోరు 322 పరుగులు అయ్యేది. ఇక సచిన్ 44 వ ఓవర్ వరకు ఉన్నాడు కాబట్టి..లాస్ట్ మూవ్ మెంట్ లో బాల్ కు రెండు పరుగులు వచ్చినా 355 పరుగుల భారీ స్కోర్ అయ్యేది కానీ ఏం చేస్తాం అక్కడ ఆడేది సచిన్.. ఆపై వంద కోసం వంద కోట్ల మంది ఎదిరి చూపులు.. దేశం పరువు గంగలో కలిసిపోతే మనకెందుకు.. ప్రపంచం ముందు కంట్రీ పరాజీతం అయితే లెక్కెందుకు.. మనకు కావాల్సింది సచిన్ సెంచరీ అనుకునే పిచ్చి అభిమానులు ఉన్నప్పుడు దేశం ఎప్పుడు బాగుపడుతుంది. ఒక్క క్రికెటే కాదు దేంట్లోనైనా ఇదే పిచ్చి అభిమానం.. వెర్రి ఆలోచన...

అతి అరుదైన సంపద అటవిపాలు..

చిత్రం
అతి అరుదైన సంపద అటవిపాలు.. అక్కడి రాళ్లు ఓ చరిత్రకు పురుడు పోసినయి. ఆ కొండలు ఘనమైన వారసత్వ సంపదను  కడుపులో దాచుకున్నయి. ప్రపంచంలో ఎత్తైన హుస్సెన్ సాగర్ బుద్ధుడికి తనువునిచ్చిన శిలలు.. వాటితో పురుడు పోసుకున్న అపురూపమైన శివుని ప్రతిమలు, లింగాలు నేడు రాళ్లు రప్పలు, చెట్ల పొదల మాటున అనాధలుగా మిగిలినయి.     అద్భతమైన పర్యాటక   క్షేత్రంగా అభివృద్ధి చెందే అన్ని అవకాశాలు ఉన్నా..పాలకుల నిర్లక్ష్యంతో బోసిపోతున్నాయి. అధికారులు ఇప్పటికైనా రాయగిరి కొండల చరిత్రపై అధ్యయనం చేసి   అక్కడి సంపదను రక్షించాలి.. పురావస్తు శాఖ అధికారులు పరిశోధన చేసి ఆలయానికి   సంబంధించిన ప్రతి విషయాన్ని అక్షరికరించాలి. పాలకులు నిద్రమత్తును వీడి అరుదైనా   విగ్రహాలకు ఆలయాన్ని నిర్మించి భవిష్యత్ తరాలకు అందించాలి.

తలపున కృష్ణమ్మ పారిన తలరాత మారడం లేదు.

చిత్రం
తలపున కృష్ణమ్మ పారిన తలరాత మారడం లేదు.       తలపున కృష్ణమ్మ పారుతున్న చెంబెడు నీళ్లు రావు.  కోట్ల రూపాయలతో సర్కారు ‌ప్రాజెక్టులు కట్టిన చుక్క నీళ్లు అందవు. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్లు నడవకుంటే గొంతు తడవని పరిస్థితి. పదుల మీటర్లు బోర్లు వేసి.. భగీరథ ప్రయత్నం చేసిన తీరని నీటి కష్టాలు. పాలకుల నిర్లక్ష్యం.. కాలం మిగిల్చిన కరువుతో అల్లాడుతున్న నల్లగొండ జిల్లా గిరిజనుల తాగు సాగు నీటి వేతలు అన్ని ఇన్ని కావు. పథకాల పేర ఊదరగొట్టే పాలకులు గిరిజనులను పట్టించుకున్న పాపానపోవడంతో నానా అవస్థలు పడుతున్నరు. ఓట్లప్పుడు ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇస్తాం, తాగునీటి కష్టాలు తీరుస్తాం. ప్రాజెక్టులను కట్టి సాగు బాధలు ఉండవని అరచేతిలో స్వర్గం చూపించే నాయకులు.. ఇప్పుడు మాత్రం తాండాల దిక్కు చూసే ప్రయత్నం కూడ చేయడం లేదని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నరు. నీళ్ల కోసం.. తమ పిల్లల చదువులు ఆగమైపోతున్నయని వారు దిగులుపుడుతున్నరు.  ఇప్పటికైనా  సర్కారు స్పందించి కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు.  

గూడు చెదిరింది.. గుండె పగిలింది.

చిత్రం
గూడు చెదిరింది..  గుండె పగిలింది.       గూడు నిచ్చె గుడిసెలు కాలీ బూడిదైపోయినయి.నీడ కరువయ్యింది. కండ్ల ముందే కాలీపోయిన గూడును చూసి గుండెలు కూలీపోయినయి. పిల్లల పెండ్లి కోసం దాచిన డబ్బులు..అందరు కలిసి పోగేసుకున్న చిట్టీల మూటలు కాగితాల్లా కాలిపోయినయి. అంతేకాదు ప్రాణానికి ప్రాణంల పెంచుకున్న పిసిపాపలు.. కనిపెంచిన పెద్దవాళ్లు గుడిసెల్లో పడి అగ్నికి ఆహుతవుతుంటే బోరున విలపించడం మినహా ఎం చేయగలరు.. వంద గుడిసెలు ఒక్కసారిగా అంటుకోవడంతో ఏం చేయాలో తెలియక లబోదిబోమంటు ఏడుస్తున్నరు. మా బతుకులెట్లరా.. దేవుడా అంటూ ఏడుస్తున్నరు.   చుట్టపు చూపుగా వచ్చిన మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదుకుంటమని చెప్పి జారుకున్నరు. దీంతో ఎలా బతకాలో.. ఏం చేయాలో తెలియక విలవిల్లాడుతున్నరు ఈ పేద జనం. సర్కారు ఆదుకుంటుందన్న ఆశలేదని.. ఎవరైనా దాతలు స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్నరు రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ మండలం గుండ్లపోచం పల్లిలో అగ్నిప్రమాదంలో గుడిసెలను కోల్పోయిన జనం.